హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దినేశ్(25) అనే యువకుడిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, నల్లకుంట పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 150 గ్రాముల ఓపియం, సెల్ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. దినేశ్ ఆరేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు వలస వచ్చాడు. నగరంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే లాక్డౌన్ కాలంలో ఉపాధి లేకపోవడంతో డబ్బులు లేకుండా పోయాయి. అప్పటికే దినేశ్ డ్రగ్స్ కు బానిస అయ్యాడు. జీవనోపాధి కష్టం కావడంతో.. డ్రగ్స్ విక్రయించి, డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు దినేశ్. దీంతో సెప్టెంబర్ మొదటి వారంలో రాజస్థాన్కు వెళ్లి అక్కడ ఒక కిలో ఓపియంను కొనుగోలు చేశాడు. ఆ డ్రగ్ను హైదరాబాద్కు తీసుకువచ్చి.. ఒక గ్రాము ఓపియంను రూ. 1400 నుంచి రూ. 1600లకు విక్రయించాడు. దినేశ్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో.. అతన్ని అరెస్టు చేశారు. దినేశ్ వద్ద ఉన్న 150 గ్రాముల ఓపియంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm