ముంబై: ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా ముంబై హైకోర్టు నేటి తన విచారణలన్నింటిని వర్చువల్ విచారణలతో సహా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జస్టిస్ సారంగ్ కొత్వాల్ సింగిల్ బెంచ్ రియా బెయిల్ పిటిషన్ను బుధవారం విచారించాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm