న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్ర వేయించుకోవడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ మేరకు బుధవారం కూడా విపక్ష పార్టీల సభ్యులంతా కలిసి పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సేవ్ ఫార్మర్స్, సేవ్ వర్కర్స్, సేవ్ డెమోక్రసీ పేరుతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ తదితర పార్టీల నేతలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారిలో టీఆర్ఎస్ సభ్యుడు కే కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు గులాంనబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm