హైదరాబాద్ : కేపీహెచ్బీ కాలనీలో నకిలీ జ్యోతిషుడి మోసం బయటపడింది. దోషం ఉందని, పూజలు చేయాలని ఓ మహిళను జ్యోతిషుడు భయపెట్టాడు. పూజలు చేయకుంటే భర్త చనిపోతాడని జ్యోతిషుడు కోసూరి మాధవ్ భయభ్రాంతులకు గురి చేశాడు. భర్త లేని సమయంలో జ్యోతిషుడు ఆమె ఇంట్లో పూజలు చేశాడు. పూజ కార్యక్రమాల్లో భాగంగా ఆమె మెడలో తాళి కట్టి ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను చూపించి మహిళను వేధిస్తున్నాడు. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మాధవ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm