హైదరాబాద్ : చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ను రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందిన రైతు తొందుర్తి సుధాకర్ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు. ఆ కుటుంబానికి రైతుబీమా పథకం కింద ప్రభుత్వం రూ. 5 లక్షల చెక్కును మంజూరు చేసింది. ఈ చెక్కును ఎమ్మెల్యే రవిశంకర్ నేరుగా ఆ రైతు ఇంటికి తీసుకెళ్లి, కుటుంబ సభ్యులకు అందజేశారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఎమ్మెల్యే రవిశంకర్ స్వయంగా రైతు కుటుంబం వద్దకు వెళ్లి ప్రగాఢ సానుభూతి తెలిపి, రూ. 5 లక్షల చెక్కును అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm