న్యూఢిల్లీ: భారత్, బ్రెజిల్, అర్జెంటీనాకు విమాన ప్రయాణాలను సౌదీ అరేబియా నిలిపివేసింది. ఈ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సౌదీకి చెందిన జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీఏసీఏ) ఈ నిర్ణయం తీసుకున్నది. సౌదీ నుంచి ఆ దేశాలకు, ఆ దేశాల నుంచి సౌదీకి విమాన రాకపోకలను రద్దు చేసినట్లు పేర్కొంది. ఈ మూడు దేశాల్లో గత 14 రోజులుగా ఉన్నవారిని కూడా తమ దేశంలోకి అనుమతించబోమని సౌదీ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ఆహ్వానితులకు దీని నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. భారత్కు చెందిన ఎయిర్ ఎక్స్ప్రెస్ విమానాల్లో ప్రయాణించిన వారికి కరోనా ఉండటంతో రెండు వారాల పాటు దుబాయ్కు విమాన సర్వీసులను నిలిపివేస్త్నుట్లు ఇటీవల చెప్పింది. అయితే ఎయిర్ ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని తర్వాత పేర్కొంది. తాజాగా భారత్తోపాటు బ్రెజిల్, అర్జెంటీనా దేశాలకు విమాన ప్రయాణాలను నిలిపివేసింది.
Mon Jan 19, 2015 06:51 pm