న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ఇటీవల సుప్రీంకోర్టులో దోషిగా తేలి రూ.1 శిక్ష ఎదుర్కొన్న ప్రముఖ న్యాయవాదికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ (బీసీడీ) నోటీసులు జారీ చేసింది. వచ్చే నెలలో తమ ముందు హాజరు కావాలంటూ ఆయనను ఆదేశించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో భూషణ్పై చట్టపరంగా తీసుకోవాల్సిన తప్పనిసరి చర్యలు తీసుకోవాలంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తన ఢిల్లీ విభాగాన్ని ఆదేశించడంతో బీసీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్విటర్లో చేసిన వ్యాఖ్యలకుగానూ కోర్టు ధిక్కరణ కింద భూషణ్ను దోషిగా నిర్ధారించినందున.. బీసీడీలో తన సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని బీసీడీ ఆయనను కోరింది. అక్టోబర్ 23న స్వయంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ముందు హాజరు కావాలని సూచించింది. ఈ నోటీసులు అందుకున్న 15 రోజుల్లోగా స్పందన తెలియజేయాలని కూడా బీసీడీ కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm