హైదరాబాద్: జమ్మూకాశ్మీర్ అధికార భాషల బిల్లుకు ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. లోక్సభలో ఈ బిల్లు నిన్ననే పాసైంది. బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి మాట్లాడుతూ .. జమ్మూకాశ్మీర్లోని 74 శాతం మంది జనాభా కశ్మీరీ, డోగ్రీ భాషలను మాట్లాడుతారన్నారు. ఈ రెండు భాషలను అధికార భాషలుగా ప్రకటించాలన్న డిమాండ్ చాన్నాళ్ల నుంచి ఉన్నట్లు చెప్పారు. 70 ఏళ్ల నుంచి వారి డిమాండ్ను ఎవరూ పట్టించుకోలేదన్నారు. కేవలం ఒక శాతం మంది మాట్లాడే ఉర్దూ భాషను మాత్రమే అధికారిక భాషగా గుర్తించారన్నారు. కాశ్మీర్లో కేవలం 2 శాతం మంది మాత్రమే హిందీ భాష మాట్లాడుతారని, కానీ హిందీ జాతీయ భాష కావడం వల్ల ఆ భాషను కూడా కశ్మీర్ లిస్టులో చేర్చినట్లు కిషణ్ రెడ్డి తెలిపారు. కశ్మీర్లో పంజాబీ, పహాడీ, గుర్జారీ భాషలను కూడా ప్రమోట్ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. డోగ్రీ, కశ్మీరీ భాషల పట్ల కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే కూడా మద్దతు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm