పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో పతాక శీర్షికల్లో నిలిచిన బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అందుకు కారణాలను ఆయన బుధవారంనాడు మీడియాకు వెల్లడించారు. వీఆర్ఎస్ తీసుకోవడం తన రాజ్యాంగపరమైన హక్కు అని అన్నారు. రెండు నెలలుగా తాను ఎంతో మనస్తాపానికి గురయ్యారని, జీవితం దుర్భరంగా అనిపించిందని అన్నారు. నా రిటైర్మెంట్ ఎప్పుడంటూ వేలాది ఫోన్ కాల్స్ వచ్చాయి. బాగా విసిగిపోయాను అని గుప్తేశ్వర్ పాండే తెలిపారు. బీహార్ పోలీసుల పట్ల ముంబై పోలీసులు అనుచితంగా ప్రవర్తించినప్పుడే తాను పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని, బీహార్ ప్రతిష్ట కోసం పోరాడాలనుకున్నానని పాండే చెప్పారు. సుశాంత్ కేసుతో తన వీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. సుశాంత్ వృద్ధ తండ్రికు సహాయంగా నిలబడాలని అనుకున్నానని, సుశాంత్ కేసులో ఎఫ్ఐఅర్ నమోదు చేయాలని బీహార్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించిందని చెప్పారు. 34 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఏ నేరస్థుడి విషయంలోనూ తాను రాజీపడలేదని, 50 ఎన్కౌంటర్లలో పాల్గొన్నానని చెప్పారు.
ప్రస్తుతానికైతే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని, దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని పాండే తెలిపారు. సామాజిక సేవ విషయానికి వస్తే, రాజకీయాల్లో చేరకున్నా సామాజిక సేవ చేయవచ్చని మాజీ డీజీపీ వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 23,2020 04:02PM