హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సిలబస్ నుండి జాతీయ నాయకులు, సంఘసంస్కర్తల జీవితాన్ని మరియు సామాజిక అంశాలైన పౌరసత్వం, సమాచార హక్కు చట్టం తదితర అంశాలను తోలగించడాన్ని నిరసిస్తూ భారత విధ్యార్ధి ఫెడరేషన్(ఎస్.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా ఎస్.ఎఫ్.ఐ.రాష్ట్ర అధ్యక్ష్యా,కార్యదర్శులు ఆర్.ఎల్.మూర్తి ,టి.నాగరాజు లు మాట్లాడుతూ కేంద్రం సిబిఎస్ఇ కోవిడ్ నేఫధ్యంలో సిలబస్ కుదించాలని నిర్ణయం చేసిన దానిలో భాగంగ తెలంగాణ రాష్ట్రంలో సిలబస్ 30% తగ్గించాలని నిర్ణయంలో భాగంగా సబెక్ట్ కమిటీ నిర్ణయించిందనే పేరుతో బోర్డు కార్యదర్శి రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పెరియార్,నారయణగురు,పౌరసత్వం, సమాచార హక్కు చట్టం,తదితరులు చరిత్రను తోలగించాలని నిర్ణయం చేయడం దుర్మార్గం అని అన్నారు. టిఆర్ఎస్ కూడా కేంద్రంలో బిజెపిలాగానే వ్యవరిస్తుందన్నారు. సిలబస్ నుండి తోలగించడం అంటే దేశానికి, సమాజానికి ఏంతో సేవ చేసిన జాతీయ నాయకులు, సంఘసంస్కర్తల ను అవమానించడమే. టిఆర్ఎస్ హైదరాబాద్ లోని అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం పెట్టడం పూనుకోని 5 లక్షల మంది విద్యార్థులకు ఆయన జీవితం గురించి తెలియకుండా చేస్తుందన్నారు.సిలబస్ తగ్గింపు పేరుతో దేశానికి లౌకికవాదం, సౌర్వభౌమత్వం,విలువలు నేర్పిన వారిని విద్యార్ధుల నుండి దూరం చేసే చర్యను టి.ఆర్.ఎస్. విరమించుకోవాలన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తిరిగి మహనీయులు జీవిత చరిత్ర ను పాఠ్యాశంలలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పారు.
అనంతరం బోర్డు కార్యదర్శి జలీల్ గారికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికోండ రవి,హైదరాబాద్ నగర అధ్యక్ష్యా,కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఎం.డి.జావీద్, నగర నాయకులు వీరేంద్ర తదితరులు పాల్గోన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 23,2020 06:54PM