హైదరాబాద్ : ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పారిస్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ టవర్తోపాటు, దాని చుట్టుపక్కల ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఆయా ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరోధించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అసలు ఏం జరిగిందంటే... ఓ ఆగంతకుడు ఫోన్ చేసి, ఈఫిల్ టవర్లో బాంబు పెట్టినట్లు తెలిపాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ టవర్లోనూ, దాని పరిసరాల్లోనూ ఉన్న యాత్రికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సియెనే నది నుంచి ట్రోకాడెరో ప్లాజా వరకు ఉన్న వంతెనను, ఈఫిల్ టవర్ కింద ఉన్న వీధుల్లో పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. అయితే తనిఖీల్లో బాంబు ఆచూకీ కనిపించకపోవడంతో, రెండు గంటల తర్వాత బారికేడ్లను తొలగించారు.
Mon Jan 19, 2015 06:51 pm