హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు- మావోయిస్టుల కాల్పులు మధ్య జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు జిల్లా ఎస్పీ సునీల్దత్ ప్రకటించారు. ఘటనాస్థలంలో పరిశీలించగా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో 8 ఎంఎం రైఫిల్, బ్లాస్టింగ్కు ఉపయోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm