హైదరాబాద్ : భారత్లో కరోనా విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడి కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన ఆయన.. చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలో ఇటీవల బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ కరోనాతో మృతిచెందగా.. తాజాగా బెల్గాం లోక్సభ సభ్యుడు సురేష్ అంగడి ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. కరోనాతో మృతిచెందిన తొలి కేంద్రమంత్రి సురేష్ అంగడి కావడం గమనార్హం. బెల్గాం లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు వరుసగా ఆయన ఎంపీగా గెలుపొందారు.
Mon Jan 19, 2015 06:51 pm