చిత్తూరు: జిల్లాలోని కుప్పం మండలం పర్తిచేను గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలకు కాపలాగా ఉన్న వారిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఒకరు మృతి చెందగా...మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వ్యక్తిని కుప్పం ఆస్పత్రికి తరలించారు. ఏనుగుల బీభత్సంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm