హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద ఆధునిక హోల్సేలర్ మరియు ఫుడ్ స్పెషలిస్ట్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ, తమ ఐదవ ఎడిషన్ ఓన్ బిజినెస్ డే తో చిరు మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలకు పలు డిజిటల్ పరిష్కారాలను పరిచయం చేసింది. ఓన్ బిజినెస్ డేను ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ మంగళవారం (13 అక్టోబర్ )నిర్వహించనున్నారు. స్వతంత్య్ర 'సొంత వ్యాపారులు' ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు తెరువబడ్డాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చిరు వ్యాపారులు, కిరాణాలు తమ వ్యాపారాలను గుగూల్పై జాబితాకరించుకునేందుకు సహాయపడటంతో పాటుగా తమ వ్యాపార దృశ్యమాన్యత, రెవిన్యూ, ఫుట్ఫాల్స్ను వృద్ధి చేసుకోవచ్చు. రాబోతున్న పండుగ సీజన్ వేళ కిరాణాల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకురావడంతో పాటుగా మెట్రో ఈఉకామర్స్యాప్ ద్వారా ఆర్డర్లు చేసే కిరాణాలకు ప్రోత్సాహాకాలను సైతం అందిస్తున్నారు. వీటిలో ఎంపిక చేసిన రోజులలో ఉచిత డెలివరీ సైతం భాగం గా ఉంటాయి. కోవిడ్ఉ19 మహమ్మారి కారణంగా ఎదురైన ప్రతికూల ప్రభావాలతో పోరాడడంతో పాటుగా స్థిరమైన కార్యక్రమాలతో పోరాడేందుకు చిరు మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు మరియు కిరాణాల ప్రయత్నాలను ప్రశంసించడానికి ఈ సంవత్సరం వేడుకలు చేస్తున్నారు. పండుగ వేడుకలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మెట్రో ఇప్పుడు దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్లు మరియు ఇతర చిరు మరియు మధ్య తరహా వ్యాపార యజమానులు పాల్గొనేందుకు ఆహ్వానిస్తుంది. వ్యాపార సంస్థలు https://www.metro.co.in/own-business-day-2020 వద్ద లేదా తమకు దగ్గరలోని మెట్రో హోల్సేల్ స్టోర్ల వద్ద నమోదు చేసుకోవచ్చు. రాబోతున్న పండుగ సీజన్ కోసం సిద్ధమవుతూ, మెట్రో ఇప్పుడు తమ సరఫరా భాగస్వాములతో కలిసి ప్రత్యేక రాయితీలను కిరాణాలు మరియు చిరు, మధ్య తరహా వ్యాపార సంస్థలకు అందిస్తుంది. వీరు తదనంతర కాలంలో ఈ ప్రత్యేక ప్రయోజనాలను తమ వినియోగదారులకు అందించగలరు. ఈ మొత్తం కార్యక్రమం మరింత మంది సందర్శించడంతో పాటుగా వినియోగదారుల సంఖ్యను వృద్ధి చేసుకోవడం, వ్యాపార యజమానులకు ఆదాయ మార్గాలను అందించుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ పండుగ సమయంలో ! దీనితో పాటుగా, మెట్రో ఇప్పుడు తమ వర్క్ఫోర్స్ను ఓన్ బిజినెస్డేలో పాల్గొనాల్సిందిగా ప్రోత్సహిస్తుంది. తమ అభిమాన కిరాణా స్టోర్కు మద్దతునందించడం ద్వారా ప్రతి రోజూ వారి జీవితాన్ని సమృద్ధి చేయడంతో పాటుగా మెట్రో వద్ద నమోదైన కిరాణా స్టోర్లలో కొనుగోలు చేసిన ఉద్యోగులకు 1500 రూపాయల బహుమతి కూడా అందిస్తుంది. ఓన్ బిజినెస్ డే కార్యక్రమం గురించి శ్రీ అరవింద్ మెడిరట్ట, ఎండీ అండ్ సీఈవో, మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా మాట్లాడుతూ మెమెప్పడూ కూడా చిరువ్యాపార సంస్థలు మరియు కిరాణాలకు డిజిటల్ పరిష్కారాలతో శక్తినందిస్తూ వారి గొంతుకగా వెలుగొందడంతో పాటుగా సాంకేతికాధారిత సమ్మిళిత వృద్ధికి తోడ్పడుతున్నాము. కోవిడ్ -19 సంక్షోభం, వినియోగదారుల ప్రవర్తన పరంగా గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది మరియు ఓన్ బిజినెస్ డే నేడు ఈ సాంకేతికతను స్వీకరించడంలో మరింత ముందుకు రావాల్సి ఉంది. వారిని గుర్తించడంతో పాటుగా వారికి శక్తిని అందించడంలో మా ప్రయత్నాలను కొనసాగిస్తూ మేము ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చాము. ఇది ఎలాంటి క్లిష్టత లేకుండా స్వీకరణకు తోడ్పడటంతో పాటుగా ఈ కిరాణాలు మరియు స్వతంత్య్ర వ్యాపార సంస్ధలు స్మార్ట్ సాంకేతికతలను స్వీకరించడంలో తోడ్పడుతున్నాం అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా భారతదేశంలో, మేము ఎన్నో విజయవంతమైన చిరు మరియు మధ్య తరహా వ్యాపార కథలలో భాగమయ్యాం. కోవిడ్ఉ19 మహమ్మారి ఇప్పుడు చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల పెనుముప్పుగా నిలిచింది. అతి తక్కువ డిమాండ్, ద్రవ్య లభ్యత లేకపోవడం మరియు భవిష్యత్పై ఆందోళనలో ఉన్నారు. ఈ సంక్షోభ సమయంలో, ఈ స్వతంత్య్ర వ్యాపార సంస్థల ప్రయత్నాలను గుర్తించి, పొగడాల్సిన ఆవశ్యకత ఉంది. దేశంలో వ్యవస్థాపక స్ఫూర్తిని వేడుక చేసే మా ప్రయత్నం ఓన్ బిజినెస్ డే్ణ్ణ అని అన్నారు. చాంఫియన్ ఫర్ ఇండిపెండెంట్ బిజినెసెస్ కోసం మెట్రో యొక్క ప్రయత్నాలను ఈప్రత్యేక దినం పునరుద్ఘాటిస్తుంది. ఇది స్వతంత్య్ర వ్యాపారాలు వృద్ధి చెందేందుకు తోడ్పడటంతో పాటుగా వారి విజయాన్ని వేడుక చేయడం మరియు బలీయమైన నెట్వర్క్ను నిర్మించడంలో భాగంగా చేపట్టిన మెట్రో యొక్క అంతర్జాతీయ ప్రచారంలో ఇది భాగం. స్థానిక ఆర్థిక వ్యవస్థలో సొంత వ్యాపారాలు అందించే విలువను తెలుపుతూనే వారికి నూతన అవకాశాలను సృష్టించడానికి మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఈ ఓన్ బిజినెస్ డే (ఓబీడీ) ను 2015లో ప్రారంభించింది. ఈ ఓబీడీని 13 అక్టోబర్ (అక్టోబర్ రెండవ మంగళవారం) తాము వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని దేశాలలోనూ వ్యాపారుల యజమానులకు నివాళిలరిస్తూ నిర్వహిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm