చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఇప్పటికే వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజూ వేలల్లోనే ఉంటున్నా.. కొత్తగా నమోదయ్యే కేసులు కూడా అంతకుమించే ఉంటున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య గత కొన్ని రోజుల నుంచి కొద్దికొద్దిగా పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,647 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,75,017కు చేరింది. అదేవిధంగా, గత 24 గంటల్లో 5,612 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,19,448కి చేరుకుంది. ఇక తమిళనాడులో యాక్టివ్ కేసుల సంఖ్య 46,336గా ఉన్నది. గత 24 గంటల్లో 85 మంది కరోనా బాధితులు మృతిచెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,233కు చేరింది. తమిళనాడు ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm