ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసుతో సంబంధం గల బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు మరింత ముమ్మరం అయ్యింది. అనుమానితులకు నోటీసులు జారీ, వాంగ్మూలాల నమోదు, అరెస్టులు ఒకదాని వెంట మరొకటి చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా శనివారం కూడా దీపికా పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధ కపూర్, కరిష్మా ప్రకాశ్ల వాంగ్మూలాలను ఎన్సీబీ నమోదు చేసిందని ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముతా అశోక్ జైన్ తెలిపారు.
అదేవిధంగా ధర్మ ప్రొడక్షన్స్కు చెందిన క్షితిజ్ ప్రసాద్ను పలు కోణాల్లో ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశామని అశోక్ జైన్ చెప్పారు. తాజా అరెస్ట్తో కలిపి ఈ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరిందని ఆయన వెల్లడించారు. అయితే శనివారం కొత్తగా ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 26,2020 07:56PM