హైదరాబాద్ : ఐపీఎల్-13లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది. వన్డౌన్ బ్యాట్స్మన్ మనీశ్ పాండే హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్సెంచరీ పూర్తి చేశాడు. మిగతా ప్లేయర్లు అంతంత మాత్రమే ఆడటంతో భారీ స్కోర్ చేయలేక పోయింది హైదరాబాద్. కోల్ కతా బౌలర్లలో కమిన్స్, రస్సెల్, వరుణ్ తలో వికెట్ తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm