విజయవాడ: ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మరికాసేపట్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 3,52,579 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3,43,690 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని...సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని పేర్కొంది. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు - గొర్రెలను వదలడం లాంటివి చేయరాదని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచనలు జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm