హైదరాబాద్: వికారాబాద్లో ఆదివారం సాయంత్రం యువతి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. రోడ్డుపై అక్కాచెల్లెళ్లు నడుచుకుంటూ వెళుతుండగా చెల్లెలిని దుండగులు అపహరించారు. కిడ్నాప్ సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు అనంతగిరి వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దుండగులను వెంటాడి యువతిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm