బిజాపూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్లోని పెడపాల్-పిడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న డిస్ట్రిక్డ్ రిజర్వ్ గార్డ్స్కు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. పోలీసులు ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm