హైదరాబాద్ : కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులపై గవర్నర్ ను కలిసేందుకు వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, ఇతర కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి, గోషా మహల్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై కాంగ్రెస్ పార్టీ మొదట నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేఫథ్యంలో ఈ బిల్లులపై వినతి పత్రాన్ని అందించేందుకు గవర్నర్ ను కలిసేందుకు వెళ్లిన సీఎల్పీ నేత బట్టిని, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వినతి పత్రం ఇవ్వడానికి కూడా వీలులేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm