విశాఖ: జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పీహెచ్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలు పట్ల ప్రభుత్వం అధికారులు పట్టుంచుకోవడం లేదని మండిపడ్డారు. సమస్యల పట్ల అధికారులను ప్రశ్నిస్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm