న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశ పరీక్షను వచ్చే నెల 10న నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా వర్సిటీ పరిధిలోని 126 డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. అయితే ఎన్ని కేంద్రాల్లో పరీక్షను నిర్వహించే అంశాన్ని త్వరలో ప్రకటిస్తామని, యూనివర్సిటీ క్యాంపస్లో 4 వేలకంటే ఎక్కువ మందికి పరీక్ష రాసే అవకాశం లేదని తెలిపింది. పరీక్ష తేదీకి ఏడు రోజుల ముందు అడ్మిట్ కార్డులు వర్సిటీ అధికారిక వెబ్సైట్ jఎఱషశీవ.ఱఅలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm