హైదరాబాద్ : దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్న్యూస్ చెప్పింది. పండగ సీజన్ వేళ రిటైల్ రుణాలపై కొన్ని రాయితీలు ప్రకటించింది. తమ యోనో యాప్ ద్వారా కారు, బంగారం, వ్యక్తిగత రుణాల తీసుకునే వారికి నూరు శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అప్రూవ్డ్ ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలుకు ఇచ్చే రుణాలపైనా నూరు శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే క్రెడిట్ స్కోరు, రుణమొత్తం ఆధారంగా 10 బేసిస్ పాయింట్లు మేర వడ్డీలో రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది. అదే యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అదనంగా మరో 5 బేసిస్ పాయింట్లు వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. సొంత కారు కలను నెరవేర్చుకోవాలనుకునేవారికి 7.5 శాతం వడ్డీకే రుణసదుపాయం కల్పిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అలాగే ఎంపిక చేసిన మోడళ్లపై నూరు శాతం ఆన్రోడ్ ఫైనాన్స్ చేస్తామని చెప్పింది. 7.5 శాతం వడ్డీకే బంగారు రుణాలు, 9.6 శాతం వడ్డీపై వ్యక్తిగత రుణాలు అందిస్తున్నామని ప్రకటించింది. పండగ సీజన్లో ప్రజలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు గానూ ఎస్బీఐ తమ వంతు తోడ్పాటు అందిస్తోందని ఎస్బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్ ద్వారా పేపర్లెస్ లోన్లు పొందొచ్చని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 28,2020 03:57PM