హైదరాబాద్ : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీలో 6.75 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ కరోనా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ నాయకులకు మరీ ఎక్కువగా కరోన కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈయన ఇటీవలే తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంతో పాటు హాజరు అయ్యారు. ఇప్పటికే ఈరోజు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా సోకింది. ఈయన కూడా ఇటీవలే తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెన్నంటే ఈ ఇద్దరు మంత్రులూ ఉన్నారు. నిన్న అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభోత్సవంలో, జగ్గంపేట మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమాల్లో కూడా మంత్రి వేణు పాల్గొన్నారు. మంత్రితోపాటు నిన్న కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అధికారులలో కలవరం మొదలయింది. అయితే మంత్రి హోం ఐసోలేషన్ లో ఉన్నారా ? లేక ఏదయినా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారా ? అనేది తెలియాల్సి ఉంది. శాల
అక్టోబర్ 5 వరకు పాఠశాలలు బంద్...Click Here...
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 28,2020 04:07PM