హైదరాబాద్ : తెలంగాణలోని బార్లు, క్లబ్బులు తెరిచేందుకు రాష్ర్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. తనిఖీలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్స్(ఎస్వోపీ)ను రూపొందిస్తున్నామని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఎస్వోపీని రూపొందించిన తర్వాత తమ పోలీసులకు వివరించి.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపడుతామని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ర్టాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ట్రాఫిక్ పోలీసు చెక్ పాయింట్లను వీలైనంత వరకు తగ్గిస్తామన్నారు. ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేపడుతామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొనే పోలీసులకు ముందుగానే శరీర ఉష్ణోగ్రత చెక్ చేస్తామన్నారు. పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm