హైదరాబాద్ : మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఫైనాన్సియల్, ఎనర్జీ, ఆటో, మెటల్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 593 పాయింట్లు ఎగబాకి 37,982కి చేరుకుంది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 11,228 వద్ద స్థిరపడింది.
Mon Jan 19, 2015 06:51 pm