హైదరాబాద్ : రాష్ట్రంలో కూరగాయలు, నిత్యావసరా ధరలు భగ్గుమనడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఈ కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ప్రజులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన వర్షంతో పంటనష్టం ఒకవైపు, మరోవైపు కొంతమంది వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి ధర పెరుగుదకు కారణమవుతున్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. తక్షణమే ధర నియంత్రణకు తగు చర్యలు తీసుకుని ప్రజలను ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) తెంగాణ రాష్ట్ర కమిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్రంలో కూరగాయలతో పాటు, ఉల్లిగడ్డ, వంటనూనే, చింతపండు, పల్లీలు, మిర్చీపొడి తదితర నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యున్ని బెంబేలెత్తిస్తున్నాయి. గత ఆరేడు నెలలుగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయి, చాలీచాలని జీతాలతో ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఈ సమయంలో కూడా కొంత మంది దళారీల కృత్రిమ కొరత సృష్టించి విపరీతంగా ధరల పెరుగుదలకు కారణమవుతున్నారు. దీంతో ఇంటి వారాంతపు బడ్జెట్ పెరిగి కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, సరుకులను వాడకపోవడంతో శరీరానికి అందాల్సిన పోషకాలు అందడం లేదు. గతంలో హైదరాబాదు చుట్టు ప్రక్క ప్రాంతాల్లో కూరగాయల సాగు చేసి రాజధానికి అందించేవారు. ప్రస్తుతం ఆ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారు కబంధహస్తాల్లో చిక్కుకున్నాయి. వీటికి తోడుగా రైతుకు మద్ధతు ధర నిర్ణయించడం, సబ్సిడీలు అందజేయడం, రవాణా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడంతో దళారుల ఇష్టారాజ్యమైంది. ప్రభుత్వ నిఘా లేదు. దీంతో ప్రజలు నిలువుదోపిడీకి గురవుతున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా వ్యవస్థను పెంచి, నిత్యావసరా ధరలు నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 28,2020 06:06PM