హైదరాబాద్: స్వచ్ఛ భారత్లో తెలంగాణ హ్యాట్రిక్ సాధించింది. వరసగా మూడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. జిల్లాల కేటగిరీలో కరీంనగర్ మూడో స్థానంలో నిలిచింది. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలు, జిల్లాలు, బ్లాక్లు, గ్రామ పంచాయతీల వారీగా అవార్డులను అందజేస్తోంది. తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం మూడు రకాల ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ మూడు కేటగిరిల్లోనూ తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించి దేశంలోనే నంబర్ వన్గా నిలించిందని కేంద్ర పారిశుద్ధ్య, తాగునీటి విభాగ(డీడీడబ్ల్యూఎస్) డైరెక్టర్ యుగుల్ కిషోర్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు మంగళవారం ఓ లేఖ పంపారు.
తెలంగాణకు స్వచ్ఛ భారత్ అవార్డులు వరించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి, మిషన్ భగీరథ తదితర కార్యక్రమాల వల్లే అవార్డులు వచ్చాయన్నారు. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివాస్ సందర్భంగా ఈ అవార్డులను కేంద్రం అందజేస్తోందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అవార్డులను అందజేస్తారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ అవార్డులను స్వీకరిస్తారని మంత్రి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 30,2020 07:16AM