ముంబై: మహారాష్ట్రలో మరో మంత్రి ఉదయ్ సామంత్ కరోనా బారిన పడ్డారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడవడంతో హోంక్వారంటైన్ లో ఉన్నాను’’ అంటూ మంత్రి ఉదయ్ సామంత్ ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని మంత్రి ఉదయ్ చెప్పారు. తన ఆరోగ్యం బాగానే ఉందని హోంక్వారంటైన్ లో ఉన్నానని మంత్రి చెప్పారు. కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదైన మహారాష్ట్రలో 12 మంది రాష్ట్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm