అనంతపురం: జిల్లాలోని పెదవడుగూరులో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం దాటికి పందలాకు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతికి ద్విచక్రవాహనం కొట్టుకుపోగా....వాహనదారులు సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే అదే వాగులో ఓ ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు... ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. చిక్కుకున్న బస్సును ట్రాక్టర్ సహాయంతో బయటకు లాగేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. వాగు ఉధృతి నేపథ్యంలో పెదవడుగూరు పోలీసులు బందోబస్తు చర్యలు చేపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm