సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుండటంతో అధికారులు 6 గేట్లు 2 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 45.107 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 174.571 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో ,అవుట్ ప్లో 1,17,498 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.
Mon Jan 19, 2015 06:51 pm