అమరావతి: ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో ఐటీ శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ కానూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మేకపాటితో 'కైనెటిక్ గ్రీన్' ప్రతినిధులు సమావేశం కానున్నారు. సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలోని మంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 1000 మంది ఉద్యోగుల సంస్థగా అవతరించిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ సమావేశంలో మేకపాటి పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm