హైదరాబాద్: మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి ఓటమి మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ జట్టుపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐతే ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మ్యాచ్ రెఫరీ రూ.12 లక్షలు జరిమానా విధించారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ సమయంలో ఢిల్లీ జట్టు మినిమమ్ ఓవర్ రేట్ను మెయింటేన్ చేయపోవడంతో ఈ జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు స్లోఓవర్ రేట్ మెయిన్టేన్ చేయకపోతే ఈ జరిమానా విధిస్తారు. ఈ సీజన్లో జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇంతకుముందు బెంగళూరు కెప్టెన్ కొహ్లీకి రూ.12 లక్షల జరిమానా పడింది.
సెప్టెంబరు 24న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు బౌలింగ్లో స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో టీమ్ కెప్టెన్ కోహ్లీ ఫీజులో రూ.12 లక్షల జరిమానా విధంచారు. ఆ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఘోరంగా ఓటమి పాలయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా మొదటి సారి రూ.12 లక్షలు ఫైన్ వేశారు. రెండోసారి అదే తప్పు చేస్తే రూ.24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి చేస్తే రూ.30 లక్షల వరకు ఉంటుంది. ఇక నాలుగో సారి తప్పు చేస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఐతే తుది జట్టులో మాత్రం ఉండవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 30,2020 10:15AM