హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇవాళ లక్నోలోని సీబీఐ కోర్టు తీర్పును వెలువరించనున్నది. అయితే ఈ కేసుకు సంబంధం ఉన్న 32 మంది కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆరు మంది కోర్టుకు హాజరుకావడం లేదు. వారిలో అద్వానీ, జోషి, ఉమాభారతిలు ఉన్నారు. వీరు భౌతికంగా కోర్టుకు వెళ్లడం లేదు. అడిషనల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎస్కే యాదవ్ ఈ కేసులో తీర్పు ఇవ్వనున్నారు. మే 2017 నుంచి రోజు వారీగా యాదవ్ కేసును విచారించారు. అయితే తుది తీర్పు రోజున నేరాభియోగం ఎదుర్కొంటున్న వారంతా కోర్టులో భౌతికంగా హాజరుకావాలంటూ ఆదేశించారు. కానీ ఇవాళ ఆరు మంది కోర్టుకు హాజరుకావడం లేదు. నృత్య గోపాల్ దాస్, కళ్యాణ్ సింగ్, సతీష్ ప్రదాన్లు హాజరుకాని వారిలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm