జైపూర్: లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు పితృవియోగం సంభవించింది. మంగళవారం రాత్రి ఓంబిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా మృతిచెందారు. ప్రస్తుతం ఆయన వయసు 92 సంవత్సరాలు. రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని తన నివాసంలో శ్రీకృష్ణ బిర్లా తుదిశ్వాస విడిచారు. శ్రీకృష్ణ బిర్లా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, మంగళవారం పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. ఢిల్లీలో లోక్సభ అధికారులు సైతం ఈ విషయాన్ని ప్రకటించారు. శ్రీకృష్ణ బిర్లా సైతం గతంలో కోటా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. కాగా, కోటాలోని కిషోర్పుర శ్మశాన వాటికలో బుధవారం శ్రీకృష్ణ బిర్లా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm