కామారెడ్డి: రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాజెక్టులు జలకళ సంతరించుకోగా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు మాత్రం వెలవెళబోతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు స్వల్పంగా నీటి ప్రవాహం వస్తున్నది. 2664 క్యూసెక్యుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 1,397.50 అడుగుల నీటిమట్టం ఉన్నది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.895 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm