ఖమ్మం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. బుధవారం వైరా మండలం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట ను తెలంగాణ రైతు సంఘం పరిశీలించడం జరిగింది, ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత 80 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో 30 వేల ఎకరాల్లో పెసర పంట పూర్తిగా నష్టం జరిగింది, అలాగే పత్తి పంట వర్షాల వల్ల కాపు లేకుండా పోయింది. కొన్ని గ్రామాల్లో పత్తి పంట ఎదుగుదల లేకుండా గిడిసబారి పోయింది. అరకొరగా కాసిన పత్తి కాయలు నల్లబడిపోయిన్నాయి. భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోయారు. మిర్చి నారుమళ్లు దెబ్బతిన్న 50 పైసలు కు కొనుగోలు చేసినా మిర్చి నారు మొక్క అధిక వర్షం వల్ల మూడు రూపాయలుకి రైతులు కొనుగోలు చేస్తున్నారు. వరి పంట కూడా అక్కడ అక్కడ దెబ్బతిన్న పరిస్థితి ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా జిల్లాలో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన సందర్భంలేదని, రెవెన్యూ చట్టంపై సంబరాలు, పాలాభిషేకాలుతో ప్రజాప్రతినిధులు బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించే విధంగా కృషి చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరావు, సుంకర సుధాకర్, శ్రీనివాస్ రావు రైతులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm