అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ చాలావరకు తగ్గింది. మునుపటితో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాలు కూడా చాలా వరకు తగ్గాయి. మరీ ముఖ్యంగా పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ సంఖ్యలోనే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కూడా అవుతున్నారు. తాజాగా.. ఏపీలో 3,676 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7 లక్షల 79 వేల 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24 మంది మృతి చెందారని.. తాజాగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,406కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 37,102 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,35, 638 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm