పట్నా: కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. బిహార్లోని లౌఖా నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన పట్నా విమానాశ్రయంలో తిరుగు పయనమవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ రెక్కలు సమీపంలో విమానాశ్రయ వైరింగ్లను తాకడంతో విరిగిపోయాయి. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కాగా ఈ ప్రమాదం నుంచి కేంద్ర మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో ఆయనతో పాటు బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్పాండే, జలవనరుల మంత్రి సంజయ్జా ఉన్నారు. ఈ ఘటనకు ముందు మధుబని జిల్లా లౌఖా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. బిహార్లో ప్రజలు మరోసారి ఎన్డీయే కూటమికి ఓటు వేసి పట్టం కట్టాలని ఆయన ఓటర్లను కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm