హైదరాబాద్: ఈ-మెయిల్తో సైబర్ నేరగాళ్లు రూ.88 లక్షలు కాజేశారు. ఈ మధ్యే కేటుగాళ్లు నగరంలో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ-మెయిల్ హ్యాకింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీల ఈ- మెయిల్ హ్యాక్ చేసి అకౌంట్ వివరాలు తీసుకొని డబ్బులు కాజేస్తున్న ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్ చేశారు. ఇద్దరి అకౌంట్ల నుంచి రూ.88 లక్షలు ముఠా కాజేసింది. బెంగాల్కు చెందిన సాగర్ మెహతా, కుమార్ గౌరవ్సింగ్, సంజయ్ అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నైజీరియన్ పాల్ హెడ్రీన్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఇప్పుడు కొందరు దుండగులు నయా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్లో ఉన్న పోలీసు, ప్రభుత్వ అధికారుల ప్రొఫైల్ ఫొటోల తీసుకుని ఆ ఫొటోలతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫొటోలతో స్నేహితులకు మనీ అర్జంట్గా ఉందంటూ మెసేజ్లు చేసి మోసం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm