హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్ దోపిడీ కేసులో పోలీసులు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 83 గ్రాముల బంగారు ఆభరణాలు, 17 వేలు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. రాయదుర్గం ఠాణా పరిధి బీఎన్ఆర్ హిల్స్లో నివసించే వ్యాపారి గూడూరు మధుసూదన్రెడ్డి ఇంట్లో ఈనెల 5న రాత్రి పని మనుషులు దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పాల్గొన్న పది మంది నేపాలీ గ్యాంగ్లో 11న ముగ్గురిని, సోమవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వంటమనిషిగా పనిలో చేరి ఆహారంలో మత్తుమందు కలిపిన జానకి బుడయర్(28)తోపాటు ఆమెకు సహకరించిన చక్ర బహుల్(23), అఖిలేష్ కుమార్(30) ఉన్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm