హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో 8 పాయింట్లతో.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. 126 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ.. బట్లర్ (48 బంతుల్లో 70 నాటౌట్), స్మిత్ (26 నాటౌట్) ఆదుకోవడంతో.. సునాయాసంగా గెలుపొందింది.
అజేయంగా 70 పరుగులు చేసిన జట్టును గెలిపించిన జోస్ బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కంటే విలువైన బహుమతి బట్లర్కు దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. తన జెర్సీని బట్లర్కు బహూకరించాడు. బట్లర్కు ధోనీ అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని ఇంటర్వ్యూల్లో అతడే పదే పదే ప్రస్తావించాడు. ఇప్పుడు ధోనీ తనదైన స్టయిల్లో మ్యాచ్లను ముగించలేకపోతున్నాడు. కానీ గతంలో ధోనీ మ్యాచ్లను ఫినిష్ చేసిన విధానం చూసిన బట్లర్.. మిస్టర్ కూల్కు ఫ్యాన్స్ అయిపోయాడు. 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ధోనీ.. తనకు ఇచ్చిన గిఫ్ట్ పట్ల బట్లర్ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. ధోనీ జెర్సీతో బట్లర్ నవ్వుతూ నిలబడిన ఫొటోను ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 20,2020 08:31AM