కృష్ణా: విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోరంకిలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.88 లక్షలు, 10 సెల్ఫోన్లు, ల్యాప్టాప్, టీవీ సీజ్ చేశారు. క్రికెట్ మజా యాప్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm