హైదరాబాద్ : ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా నిలిచింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉన్న ఢిల్లీ జట్టుతో, గేల్ రాకతో జోరుమీదున్న పంజాబ్ జట్టు తలపడబోతోంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా దూరమైన రిషబ్ పంత్తో పాటు, హెట్మయిర్, డేనియల్ శామ్స్ ఈ మ్యాచ్లో ఆడనున్నారు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టులో జోర్డాన్ బదులు నీషమ్ ఆడనున్నాడు. ఇప్పటివరకూ జరిగిన 9 మ్యాచ్ల్లో ఏడు మ్యాచ్ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు ప్రథమ స్థానంలో ఉండగా, 9 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచిన పంజాబ్ ఏడో స్థానంలో ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm