హైదరాబాద్: టీ20 లీగ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీపై కోల్కతా తడబడి నిలబడింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా.. కోల్కత్తా బ్యాటింగ్కు దిగింది. ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన కోల్కత్తా 42పరుగులకే 3వికెట్లు నష్టపొయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో నితీష్ రానా, సునీల్ నరైన్ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించారు. 157పరుగుల వరకు వికెట్ పడకుండా ఆడి కోల్కత్తా స్కోరును నడిపించారు. కోల్కతా తరఫున సునీల్ నరైన్ 32 బంతుల్లో 64పరుగులు చెయ్యగా, నితీష్ రానా 53 బంతుల్లో 81 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రబాడా, స్టోయినిస్, నార్ట్జే తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కత్తా..మొదట్లోనే తడబడింది. రెండో ఓవర్లో 11 పరుగుల స్కోరుపై అద్భుతమైన ఫామ్లో ఉన్న షుబ్మాన్ గిల్ 09 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ఆరో ఓవర్లో 35 పరుగుల స్కోరుతో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రాహుల్ త్రిపాఠి 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 194పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm