హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగంలో ఫలితాలను జెఎన్టియు హైదరాబాద్లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ అధికారులతో కలిసి శనివారం ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ విభాగాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకులను అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. ఎపికి చెందిన విద్యార్థిని గుత్తి చైతన్య సింధు మొదటి ర్యాంకు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
టాప్ 10 ర్యాంకర్లు..
1. గుత్తి చైతన్య సింధు - తెనాలి (ఎపి)
2. మారెడ్డి సాయి త్రిషా రెడ్డి - సంగారెడ్డి
3. తుమ్మల స్నికిత - హైదరాబాద్
4. దర్శి విష్ణు సాయి - నెల్లూరు (ఎపి)
5. మల్లిడి రుషిత్ - ఖమ్మం
6. శ్రీమల్లిక్ చిగురుపాటి - హైదరాబాద్
7. ఆవుల సుబాంగ్ - హైదరాబాద్
8. గారపాటి గుణ చైతన్య - కర్నూలు (ఎపి)
9. గిండేటి వినరు కుమార్ - చిత్తూరు (ఎపి)
10. కోట వెంకట్ - ఇబ్రహీంపట్నం - కృష్ణా (ఎపి)
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 24,2020 06:53PM