విశాఖ: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు హత్యకు కుట్ర జరిగినట్లు బెదిరింపు మెసేజ్ వచ్చింది. అవతలి వ్యక్తి ఎస్సై నంటూ మేసేజ్ పెట్టారు. హత్యకు లావాదేవీలు కూడా జరిగాయని సారాంశం. హత్యచేసి మావోయిస్టులు చేసినట్లు చిత్రీకరిస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ మేసేజ్ పై అయ్యన్నపాత్రుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు వియ్యపు తాతారావును అరెస్ట్ చేశారు. వియ్యపు తాతారావు బుచ్చయ్యపేట కేటీ ఆగ్రహారం వాసిగా గుర్తించారు. తాతారావు గతంలో పలువురికి బెదిరింపు మేసేజ్లు చేసినట్లు కూడా పోలీసు విచారణలో గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm