హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగోటం గ్రామానికి చెందిన పుట్ట చంద్రమ్మ(65) రెండో కుమారుడు రాముడుకు 12ఏళ్ల క్రితం వివాహమైంది. రాముడు తాగుడుకు బానిస కావడంతో ఇతని ప్రవర్తన నచ్చని భార్య వదిలివెళ్లిపోయింది. దీంతో రాముడు, అతని తల్లి ఒకే ఇంట్లో ఉంటున్నారు. రోజూ రాముడు మద్యం తాగివచ్చి తల్లితో గొడవ పడేవాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగేందుకు డబ్బులు కావాలని రాముడు తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడై కొడవలితో తల్లి గొంతుకోసి ఆమె తలను తీసుకొని పారిపోయాడు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కొల్లాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm